ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅమరావతిలో ఎయిర్ పోర్ట్ గుంటూరు - విజయవాడను కలిపి మెగా సిటీ చేస్తాం మంత్రి నారాయణ...

అమరావతిలో ఎయిర్ పోర్ట్ గుంటూరు – విజయవాడను కలిపి మెగా సిటీ చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి రాజధాని పనుల పరిశీలన

📰 Generate e-Paper Clip

జయజయహే: అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను, మంత్రి నారాయణ, సీఆర్డీయే, మైనింగ్ శాఖల అధికారులు పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయన్నారు. రాజధానిలోని అనంతవరంలో మంత్రి నారాయణ పర్యటించిన సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టింది. 68 పనులకు సంబంధించి 42,360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి. ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయే కు కేటాయించింది. గతంలో అనంతవరం కొండను సీఆర్డీయే కు కేటాయించారు. కానీ గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ్వేశారు. ఇక్కడ భూమిని కూడా ఏదో ఒక అవసరానికి ఉపయోగిస్తాం. రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టాలని సీఎం చంద్రబాబు యోచిస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు, విజయవాడలను కలిపి మెగాసిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎయిర్ పోర్టు కోసం కనీసం 5 వేల ఎకరాలు అవసరం, ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే 30 వేల ఎకరాలు అవసరం. భూసేకరణ చేస్తే రిజిస్ట్రేషన్ ధరపై రెండున్నర రెట్లు మాత్రమే వస్తుంది. భూ సేకరణ ద్వారా తీసుకుంటే రైతులు నష్టపోతారని, భూమి సమీకరించాలని స్థానిక ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మూడేళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. రాజధానిలో 92 పనులను 64,912 కోట్లతో చేస్తున్నామని’ ఆయన వివరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!