ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeబిగ్ బాస్టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ సత్కారం

టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ సత్కారం

📰 Generate e-Paper Clip

చోడవరం : జయజయహే : లయన్స్ క్లబ్ చోడవరం శాఖ ఆధ్వర్యంలో చోడవరం మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ స్థానం పొందిన విద్యార్థులను సోమవారం చోడవరం వారు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ చోడవరం శాఖ అధ్యక్షులు డాక్టర్ నీలం నాగేంద్రబాబు , ఉపాధ్యక్షులు పసుమర్తి సాంబశివరావు , క్లబ్ కార్యవర్గ సభ్యులు హాజరై విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు సాధించిన ఈ ఫలితాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించాలని ఆశించారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థికి లయన్స్ క్లబ్ చోడవరం శాఖ తరఫున సుమారు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహం, సత్కార సాలువాలు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమక్షంలో నిర్వహించారు.ఈ సత్కార కార్యక్రమానికి లక్ష్మీపురం ఉపసర్పంచ్ ఆది గణపతి నాయుడు, మండల విద్యాశాఖ అధికారి సింహాచలం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవి జగన్నాథరావు, స్కూల్ కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే లయన్స్ క్లబ్ సర్వీసెస్ చైర్‌పర్సన్ ముక్కా రమేష్, ఎల్సిఐఎఫ్ చైర్‌పర్సన్ డాక్టర్ పూసర్ల శకుంతల రావు, సాయిరాం శ్రీను మార్కెటింగ్ చైర్‌పర్సన్ నల్లమిల్లి గనీరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ బద్రి మహంతి పల్గున్, ఉగ్గిన నాగబాబు, వేపాడ సత్యనారాయణ, పనతల గంగాధర్ మాస్టారు, ట్రెజరర్ విజయ బుజ్జి రెడ్డి, ఎస్ ఎస్ షాపింగ్ మాల్ శ్రీనివాసు, రుద్రరాజు సతీష్ వర్మ, శ్రీనివాసరావు మాస్టారు, సుంకర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.పట్టణంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న వారందరినీ లయన్స్ క్లబ్ సభ్యులుగా చేరాలని క్లబ్ ప్రతినిధులు కోరుతూ, తద్వారా మరింత సేవా కార్యక్రమాలు చేపట్టి చోడవరం పరిసర ప్రాంత ప్రజలకు మేలు చేకూరుస్తామని తెలిపారూ.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!