వైఎస్సార్ జిల్లా పేరు కడప గా మార్చేసిన చంద్రబాబు-మహానాడు వేళ కీలక ఉత్తర్వులు..!
కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో కీలక మలుపు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చేస్తున్నాయి. ఇదే క్రమంలో కీలకమైన వైఎస్సార్ జిల్లా పేరును మారుస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ జిల్లా పేరు మార్పుపై నిర్ణయం తీసుకుంది. దీన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కానీ వైసీపీ అధికారంలోకి రాగానే కడప జిల్లా పేరులో ఉన్న వైఎస్సార్ ను మాత్రమే ఉంచి కడపను తీసేసింది. దీంతో వైసీపీ హయాంలో ఇది వైఎస్సార్ జిల్లాగానే కొనసాగింది. సెంటిమెంట్ పేరైన కడపను జిల్లా పేరులో నుంచి తీసేయడంపై విమర్శలు వచ్చినా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. దీంతో కేవలం వైఎస్సార్ జిల్లాగానే ఇది ఇప్పటివరకూ కొనసాగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం తాజాగా కేబినెట్ భేటీలో వైఎస్సార్ జిల్లా పేరులో తిరిగి కడపను చేర్చాలని నిర్ణయం తీసుకుంది.
RELATED ARTICLES


