విశాఖపట్నం జయ జయహే: జీవీఎంసీ 45 వార్డులో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ సింగ మాంబ అమ్మవారి పండుగ మహోత్సవం సందర్భంగా కమిటీ వారి ఆహ్వానం మేరకు అమ్మవారిని వికె పిసిపిఐఆర్ యుడిఎ మాజీ చైర్ పర్సన్ చొక్కాకుల వెంకటరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదములు స్వీకరించారు.ఈ సందర్భంగా కమిటీ వారు చొక్కాకుల వెంకటరావు ను సాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదమును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షుడు వాసుపల్లి అమ్మోరు, కార్యదర్శి దౌలపల్లి బుడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
