పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం గ్రామంలో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భారీ బైక్ ర్యాలీతో పాటు భారీ జన సమీకరణం తో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కు ఘనంగా అభిమానులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని నూతన కార్యాలయానికి వేదమంత్రాలతో గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి కార్యాలయమును ప్రారంభించారు అనంతరం కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాశ్మీర్లో ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ జమ్మూ కాశ్మీర్ లోని బైస రన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్ర దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించి మృతులకు సంతాపం తెలియజేసారు అనంతరం సభను ఉద్దేశించి నియోజకవర్గంలో కానీ మండలంలో కాని ఏ సమస్య వచ్చినా నాయకుడితో సంబంధం లేకుండా ఎన్డీఏ కూటమి కార్యకర్తలకు డైరెక్ట్ గా ఎమ్మెల్యే గ ఏ సమస్య వచ్చినా కలవచ్చని భరోసా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం మరియు సబ్బవరం మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు
జనసేన పార్టీ నూతన కార్యాలయమును ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల
RELATED ARTICLES
