ప్రభుత్వం, పోలీసులు అత్యాచార ఘటనలపై ఎన్ని చట్టాలు తీసుకువచ్చి.. చర్యలు తీసుకుంటున్నా.. నేరాలు ఆగడంలేదు… తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కడప జిల్లా , జమ్మలమడుగు లోని శివారెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో 7 ఏళ్ల బాలికలపై యువకుడు అఘాయిత్యానికి యత్నించాడు. ఇద్దరు పిల్లలపైన అత్యాచారం చేయబోయాడు. అయితే సకాలంలో గుర్తించిన కాలనీ వాసులు యువకుడిని పట్టుకున్నారు. కామాంధుడికి దేహశుద్ది చేసి.. జమ్మలమడుగు పోలీసులకు అప్పగించారు. అదుపులోకి తీసుకున్న పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.