చోడవరం: జయజయహే : చోడవరంలో వేంచేసియున్న శ్రీ ఆపదహర శ్రీనివాస క్షేత్రంలో ఈనెల 8వతేదీ నాడు జరుగబోయే వార్షిక కళ్యాణోత్సవాలకు సంబంధించి బుధవారం పెండ్లిరాట కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక శాసనసభ్యులు కే ఎస్ ఎన్ ఎస్ రాజు ముఖ్యఅతిథిగా హాజరై ముహూర్తపు రాటవేశారు. ఆలయ చైర్మన్ వింజమూరి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యులు స్థానిక ప్రముఖులు శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.
