జయజయహే : అలియాస్ అల్లూరి శ్రీనివాస్కు బిగ్ షాక్ తగిలింది. అతడిని అరెస్టు చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు అఘోరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. కోర్టులో విచారణ అనంతరం అఘోరీ తరఫు లాయర్ సంచలన విషయాలు బయటపెట్టారు. కోర్టులో ఎలాంటి వాదనలు జరగలేదని ఆయన అన్నారు. కోర్టు తరపున అడ్వకేట్ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు తనను అపాయింట్ చేయడం జరిగిందని లాయర్ అన్నారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన తర్వాత బెయిల్ వస్తాదా? రాదా ? అనేది తెలుస్తుందని ఆయన అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని.. తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పుకొచ్చారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించడం చాలా తప్పు అని.. ఒకవేళ అఘోరీ చేసింది తప్పు అని నిర్దారణ అయిన తర్వాత శిక్ష కచ్చితంగా పడుతుందని అన్నారు. ఒకేవేళ అఘోరీ తప్పు చేసినట్లు రుజువు అయితే 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. చీటింగ్ కేసులో అరెస్టైన అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించే అవకాశం ఉంది.
జైలుకు అఘోరీ
0
32
RELATED ARTICLES

