ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీసింహాచలం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం: సీఎం చంద్రబాబు

సింహాచలం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం: సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

అమరావతి: జయజయహే : సింహాచలం ఘటన పై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, గాయపడిన వారికి రూ.3లక్షల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆయన ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!