మాడుగుల : జయజయహీ : సమస్యలు పరిష్కారానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గురువారం చీడికాడ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి అన్నారు. సందర్భంగా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు అందజేసి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్
0
46
Previous article
Next article
RELATED ARTICLES

