పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు
పెరగటంతో పాక్ విమానాలకు భారత్ గగనతలంపై నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నిషేధం మే 23 వరకు అమలవుతుందని గతంలో భారత్ ప్రకటించగా తాజాగా ఆ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు నిషేధం పొడిగిస్తున్నామని జూన్ 23 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని భారత్ వెల్లడించింది
