ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఐటీ శాఖ మంత్రిని కలిసిన వి ఎం ఆర్ డి ఎ చైర్మన్

ఐటీ శాఖ మంత్రిని కలిసిన వి ఎం ఆర్ డి ఎ చైర్మన్

📰 Generate e-Paper Clip

జయజయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ఉండవల్లి క్యాంప్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, బృహత్ ప్రణాళిక, ఎం ఐ జి బడ్జెట్ అపార్ట్మెంట్ హౌసింగ్ స్కీమ్ గురించి వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పలు సూచనలు చేశారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యే నాటికి విశాఖను అనుసంధానం చేసే రహదారులు అందుబాటులోకి తీసుకురావాలని, నగరంలోని పార్కులన్నీ అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!