Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీఅణు బాంబుల పేరుతో ఎవరు బెదిరించలేరు

అణు బాంబుల పేరుతో ఎవరు బెదిరించలేరు

నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు

హద్దు మీరితే సహించేది లేదు

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

దేశ ప్రజల్ని ఉద్దేశించి కీలక ప్రసంగం

జయజయహే : భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని అన్నారు. పాకిస్తాన్‌ను హెచ్చరించడానికే కాకుండా, ఉగ్రవాదంపై భారతదేశం జీరో టాలరెన్స్ పాలసీని ప్రకటించడానికే ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. అణుబాంబుల పేరుతో ఎవరు కూడా బెదిరించలేరని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. భారతదేశం ఎటువంటి అణ్వస్త్ర బెదిరింపులను సహించదు. భారతదేశం తన సొంత షరతులపై తగిన సమాధానం ఇస్తుంది. అణు బెదిరింపు ముసుగులో అభివృద్ధి చెందుతున్న ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఖచ్చితమైన, నిర్ణయాత్మక దాడిని ప్రారంభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. భారతదేశం తన పౌరుల గుర్తింపు, భద్రతతో ముఖ్యంగా మహిళలతో ఆడుకునే వారికి తగిన సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు కూడా వెనుకాడదని మోదీ స్పష్టం చేశారు. దేశాన్ని కుదిపేసిన పహల్గామ్ దాడి తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించడం ఇదే తొలిసారి. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక చర్య కాదని, న్యాయం వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఒక చారిత్రాత్మక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఇది కేవలం ప్రతీకార దాడి మాత్రమే కాదని, ఉగ్రవాదంపై కొత్త వ్యూహాత్మక ఆలోచన, నిర్ణయాత్మక చర్యకు నిదర్శనమని ప్రధాని మోదీ అన్నారు. ఆపరేషన్ సింధూర్ భారతదేశం బలం, సున్నితత్వం, సంకల్పానికి ప్రతీక అని అన్నారు. దీనిని భారతదేశపు కుమార్తెల గౌరవం కోసం జరిగిన నిర్ణయాత్మక యుద్ధంగా మోదీ అభివర్ణించారు. మన ధైర్య సైనికులు అపారమైన ధైర్యాన్ని ప్రదర్శించారని కూడా ఆయన అన్నారు. ధైర్యాన్ని దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు అంకితం చేస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ప్రకటన పాకిస్తాన్ కు ప్రత్యక్ష సందేశం మాత్రమే కాదు, ఉగ్రవాదంపై భారతదేశం మారుతున్న విధానాన్ని కూడా సూచిస్తుంది. మోడీ పాకిస్తాన్‌ను స్పష్టమైన మాటలలో హెచ్చరించారు. పాక్‌ బతకాలంటే ఉగ్రవాద నిర్మాణాన్ని నాశనం చేయాలి. లేకపోతే పాకిస్తాన్ ఇతరులకు వ్యాపింపజేస్తున్న విషంలో మునిగిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారికి, ఉగ్రవాదాన్ని అమలు చేసేవారిని భారత్‌ సహించదన్నారు. అణు బ్లాక్‌మెయిలింగ్ లేదా యుద్ధ బెదిరింపులు ఇకపై భారతదేశాన్ని భయపెట్టవు. దాడి జరిగితే, ప్రతిస్పందన ఉంటుంది.. అది కూడా రెట్టింపు స్థాయిలో తమ చర్యలు ఉంటాయన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?