SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 6:43 am Posted by : SHIVASURYA NEWS

మనస్థాపానికి గురై ఒక వ్యక్తి ఆత్మహత్య

మాడుగుల జయజయహే : మనస్థాపానికి గురై ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం సాయంత్రం మాడుగుల మండలంలో జరిగింది. స్థానిక ఎస్సై నారాయణరావు అందించిన వివరాలు ప్రకారం మండలం లో జాలంపల్లి గ్రామానికి చెందిన పినబొయిన లోవ (38), అనే వ్యక్తి మద్యానికి బానిసై తన భార్య లక్ష్మి కి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. దీంతో గత కొద్ది రోజుల కిందట భార్య పుట్టి ఇంటికి వెళ్లడం వల్ల లోవ మనస్థాపం చెంది శుక్రవారం సాయంత్రం వారి పాకలు వద్ద తాడు తో ఉరి వేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. దీంతో భార్య లక్ష్మి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.