SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 11:01 am Posted by : SHIVASURYA NEWS

ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలి – సచివాలయాన్ని సందర్శించిన రేగం మత్స్యలింగం

హుకుంపేట : జయజయహే : అరకు నియోజకవర్గం,హుకుంపేట మండలం & గ్రామ పంచాయితీ సచివాలయాన్ని అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆకస్మికంగా సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సచివాలయ సిబ్బంది ఎమ్మెల్యే విచ్చేసిన తరుణంలో పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..గ్రామ సచివాలయ సిబ్బంది ప్రజలతో మమేకమై పని చేయాలని దిశ నిర్దేశం చేశారు.ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో హుకుంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కుమారి సమిడ వెంకటపూర్ణిమ , వైసిపి హుకుంపేట మండల పార్టీ అధ్యక్షులు పాంగి అనిల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ, వైస్ సర్పంచ్ గోవింద్ ,సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..