SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 10:12 am Posted by : SHIVASURYA NEWS

అశోక్ బంగ్లా లో ప్రజా దర్బార్

విజయనగరం జయజయహే: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులు, వినతులను స్వీకరించు నిమిత్తం “ప్రజాదర్బార్” నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన హౌసింగ్, పింఛన్లు, రోడ్లు, కాలువలు, దోబీఖానా నిర్మాణం వంటి అనేక అంశాలపై వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రజల నుండి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పరిష్కారం నిమిత్తం పంపించడం జరుగుతుంది, అదేవిధంగా సమస్యలు పరిష్కారం అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరియు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అధికారులు సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని అన్నారు.