SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 8:24 am Posted by : SHIVASURYA NEWS

శ్రీశ్రీశ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్

విశాఖపట్నం : జయజయహే : శ్రీ శ్రీ శ్రీ కరక చెట్టు పోలబాంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తమ కుటుంబ సభ్యుల తో కలిసి మంగళవారం తెల్లవారు జామున పోలమాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారి గర్భాలయంలో ఆలయ అర్చకులు పసుపు, కుంకుమతో ప్రణవ్ గోపాల్ ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో గాయత్రి అమ్మవారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అమ్మవారి దయతో ఎటువంటి విపత్తులు, చెడు సంఘటనలు జరగకుండా, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు.