సీఎం పీఠం వైపు ఎవరూ కన్నెత్తి చూడకూడదు ఈసారి అలా పరిపాలన చేయాలి పేదవారికి మీరు ఆక్సిజన్ కావాలి జగన్ కు ముద్రగడ లేఖ పీఏసీలోకి తీసుకోవడంపై కృతజ్జతలు

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మాజీ సీఎం జగన్ కు లేఖ రాశారు. తనను వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి తీసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు త్రికరణశుద్ధిగా కష్టపడతానని లేఖలో పేర్కొన్నారు. పేదవారికి మీరే ఆక్సిజన్ అంటూ కొనియాడారు. ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరూ కన్నెత్తి చూడని విధంగా పది కాలాల పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. కాపు ఉద్యమ నేతగా గుర్తింపు ఉన్న ముద్రగడ పద్మనాభం గత ఎన్నికలకు కొన్ని...