ఆల్ టైమ్ హై..! రికార్డు ధరకు చేరిన బంగారం

అమెరికా-చైనా ట్రేడ్ వార్ తీవ్రమవుతున్న తరుణంలో బంగారం ధర ఇవాళ పది గ్రాములకు ₹6,250 పెరిగి ₹96,000 స్థాయిని దాటింది. ప్రపంచ ట్రెండ్‌లకు అనుగుణంగా వెండి ధరలు కూడా కిలోకు ₹2,300 పెరిగి ₹95,500 కు చేరుకున్నాయి. గత మార్కెట్ ముగింపులో ఈ తెల్ల లోహం కిలోకు ₹93,200 వద్ద ముగిసింది. స్థానిక ఆభరణాల వ్యాపారులు, రిటైలర్ల నుండి భారీ డిమాండ్ కారణంగా శుక్రవారం దేశ రాజధానిలో బంగారం ధరలు ₹6,250 పెరిగి ₹96,450 రికార్డు స్థాయికి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్...