SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 April 2025, 11:17 am Posted by : SHIVASURYA NEWS

శ్రీ వేణుగోపాలస్వామి వారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం

మాడుగుల : జయజయహే : మాడుగుల నియోజకవర్గ పరిధిలోగల దేవరాపల్లి మండలంతెనుగుపూడి శివారు గొల్లపేట గ్రామంలో బుధవారం జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు,దేవరాపల్లి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు కిల్లాన శ్రీనివాస్ యాదవ్ ,దేవరాపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాము , ఏ.కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చింతల వెంకటరమణ ,గరిసింగి గ్రామ సర్పంచ్ గూడెపు రాము ,వెంకటరాజపురం గ్రామ సర్పంచ్ దాసరి సంతోష్ కుమార్ ,తెనుగుపూడి గ్రామ ఉప సర్పంచ్ కాటిపాము పెద నాయుడు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా నాయుడు, విస్సారపు అప్పారావు , విస్సారపు నర్సిబాబు, గ్రామ వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వేణుగోపాల్ స్వామి యువజన సంఘం సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.