నందవరం,శివసూర్య,జూలై 5:
గత పది నెలల నుండి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే బీవీ జగనేశ్వర్ రెడ్డికి దూరంగా ఉన్న మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ దేశాయి మాధవరావు సుపరిపాలన తొలి అడుగు పర్యటనలో భాగంగా శనివారం ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి దేశాయ్ మాధవరావు ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకుని బుజ్జగించడం జరిగిందని దేశాయ్ వర్గం వారు తెలిపారు. అలాగే మండలంలో మంచి పేరున్న నాయకుడుగా దేశాయ్ మాధవరావు ఉన్నారని తెలుసుకోవడంతో ఎమ్మెల్యే బీవీ మంత్రంగాలు జరిపి అసంతృప్తిని చల్లబడేటట్లు చేశారన్నారు.

