Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీఅమరావతి పునర్నిర్మాణ సభ - వైఎస్ జగన్‌కు ప్రభుత్వం ఆహ్వానం

అమరావతి పునర్నిర్మాణ సభ – వైఎస్ జగన్‌కు ప్రభుత్వం ఆహ్వానం

జయజయహే : అమరావతి పనుల పునఃప్రారంభానికి రావాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్​రెడ్డికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ప్రధాని చేతుల మీదుగా జరిగే కార్యక్రమానికి రావాలని ఆయన్ని ఆహ్వానించింది. ఈ మేరకు తాడేపల్లి నివాసంలో జగన్‌ అందుబాటులో లేకపోయే సరికి వాళ్ళ పీఎస్‌కు ఆహ్వాన పత్రికను అధికారులు అందజేశారు. కార్యక్రమానికి ఆయన హాజరు కావాలని కోరుకుంటున్నామని మంత్రులు తెలిపారు. ముఖ్యమైన కార్యక్రమానికి అన్ని పార్టీల భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ మే 2న రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాజధానిలో చేపట్టే రూ.49,040 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని డీఆర్‌డీవో, డీపీఐఐటీ, ఎన్‌హెచ్‌ఏఐ, రైల్వేకు సంబంధించి రూ.57,962 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?