చోడవరం: జయజయహే : ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చోడవరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి ఆధ్వర్యంలో పట్టణ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రి ప్రధాన వైద్యాధికారి ఎల్ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తూరు జంక్షన్ లో మానవహారం ఏర్పాటు చేసి మలేరియా ముందస్తు జాగ్రత్తలు వివరిస్తూ ప్రతి ఒక్కరుకి పరిసరాలతో పాటు వ్యక్తిగత మరి శుభ్రత అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ దినేష్ డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ హిమబిందు చోడవరం మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎస్ వి రమణ, ఎంపీహెచ్ఈఓ పి రవికుమార్, హెచ్ ఎస్ రామకృష్ణ, ఎల్టి ఎమ్ఎస్ శంకర్రావు, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.


