ఈనెల 09 వ తేదీన ఉదయం 10 గంటలకు విశాఖపట్నం జిల్లా వైసీపీ పార్టీ నూతనఅధ్యక్షులుగా కె.కె రాజు ప్రమాణ స్వీకారం
మాజీ ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి నాపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యత నాపై మరి అంత బాధ్యతను పెంచిందని మనం అందరం కలిసి నగరంలో పార్టీని మరింత పటిష్టం చేసి రాబోయే రోజుల్లో పార్టీ పెద్దలు, నాయకులు,కార్యకర్తలు అందరి సహకారంతో కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రా కు చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేద్దామని అన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు , మాజీ మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ కి , పార్లమెంటు సభ్యులకు శాసనమండలి సభ్యులకు విశాఖ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్తలకు , పార్టీ జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని తెలిపారు

