SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 11:08 am Posted by : SHIVASURYA NEWS

హనుమాన్ శోభయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించిన అనకాపల్లి ఎంపీ

అనకాపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించు శోభయాత్రను విజయవంతం చేయాలి అని పిలుపు.

అనకాపల్లి : జయజయహే : అనకాపల్లి ఎంపీ క్యాంపు కార్యాలయం లో పార్లమెంట్ సభ్యులు సి.ఎం రమేష్ చేతుల మీదుగా హనుమాన్ శోభాయాత్ర కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం శోభ యాత్ర కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఆవిష్కరణ అనంతరం సి.ఎం రమేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా హిందు బంధువులు అందరు స్వచ్ఛందంగా రేపు పట్టణంలో జరుగు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నాలని పిలుపునీచ్చారు. కార్యక్రమం లో హనుమాన్ శోభాయాత్ర కమిటీ ప్రతినిధులు డిడి నాయుడు,మాఊరి జయప్రకాష్ కొండలరావు, ఆడారి కుమారస్వామి, నుదురుపాటి అప్పల నరసింహం (తాతాజీ), శృంగవరపు. శ్రీకాళహస్తి, ఏ సాయి ప్రదీప్ , పూజ్యం నాగబాబు మరియు బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గేదెల స్వరూప్ , విశ్వహిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయంసేవక్ బజరంగ్దళ్ వినాయక ఉత్సవ నిమజ్జనొత్సవ కమిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.