విశాఖపట్నం: జయజయహే : సిరి ప్రసాద్ ట్రాక్ సాంగ్స్ బ్యానర్ ను జబర్దస్త్ ఆర్టిస్ట్ సత్తిపండు ప్రారంభించారు. జీ ఆర్ కే అధినేత గేదెల ఈశ్వరరావు ఆధ్వర్యంలో గాజువాకలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గాయనీ, గాయకులకు ఉపాధి అవకాశాలతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ఈ బ్యానర్ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. కళాకారులకు ప్రోత్సాహం అవసరమని, ఇటువంటి బ్యానర్లు ప్రారంభించడం ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత పాలకుర్తి సుబ్బారావు, జి ఆర్ కే మ్యూజిక్ అధినేత గేదెల ఈశ్వరరావు రచయిత ఈవిఆర్, నాని వెంకట్, జి అప్పలరాజు, రచయిత, లఘు చిత్ర దర్శకులు నాని నాయుడు, గాయనీ, గాయకులు ఎల్. బాలకృష్ణ, ప్రసాద్ సరోజ జానకి సుబ్బారావు, మనోహర్, గెద్దాల అప్పలరాజు మాధవ రెడ్డి, స్వామి రెడ్డి, గాయత్రి, లక్ష్మీ ప్రియా, ఉషారాణి పాల్గొన్నారు