SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 6:36 am Posted by : SHIVASURYA NEWS

శేషాచల అడవుల్లో మంటలు.

జయజయహే : శేషాచల అడవుల్లో మంటలు చెలరేగాయి.అన్నమయ్య జిల్లా బల్లి డివిజన్,మొగిలి పెంట వద్ద మంటలు వ్యాపించాయి .అటవీశాఖ సిబ్బంది మంటలు అదుపుచేశారు. మంటలను అదుపు చేసేందుకు నాలుగు బృందాలుగా అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అటవీశాఖ అధికారులు మధ్య సమన్వయ లోపం కారణంగానే మంటలు చెలరేగుతున్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వేసవి లో అగ్ని ప్రమాదాలు నివారణకు అధికారులు ముందు జాగర్త చర్యలు చేపట్టలేదు. అటవీ ప్రాంతంలోకి అనుమతి లేకుండా ఎవరు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేసారు.