SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 7:49 am Posted by : SHIVASURYA NEWS

విగ్రహ పునః ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వికె పిసిపిఐఆర్ యూడిఎ మాజీ చైర్ పర్సన్

జయజయహే : జీవీఎంసీ 47 వ వార్డు బాపూజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ గణపతి సుబ్రహ్మణ్య దుర్గా నూకాంబికా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల నూతన ఆలయ శిఖర యంత్ర ప్రతిష్ట విగ్రహ పునః ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వికె పిసిపిఐఆర్ యూడిఎ మాజీ చైర్ పర్సన్ చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ వారు ప్రత్యేక పూజలు చేయించి స్వామివారి తీర్థ ప్రసాదములు అందించారు. ఈ కార్యక్రమం లో 47వ వార్డు కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, కోరుబిల్లి విజయ్, గురువోజి, కర్రి శంకర్రావు, ఎ. రమేష్ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎస్. గంగరాజు, కార్యదర్శి బి. సూర్య శేఖర్, ఎం సుందర రెడ్డి, గోపి, వై శ్రీనివాసరావు, కె. శివన్నారాయణ, ఎం భాస్కర్ రెడ్డి, వెంకటేష్, వెంకటరమణ, డి. రమేష్, నూకరాజు మరియు మహిళలు పాల్గొన్నారు.