SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 9:52 am Posted by : SHIVASURYA NEWS

లబ్ధిదారులకు ఆసరా ఎన్టీఆర్ భరోసా

చోడవరం జయజయహే : లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా ఒక ఆసరాగా నిలిచిందని వాటిని ద్వినియోగపరుచుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు అన్నారు.పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం చోడవరంలో ఎడ్ల వీధి లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్దిదారులతో మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గునూరు మల్లునాయుడు , గునురూ పెదబాబు, దేవరపల్లి వెంకట అప్పారావు,సకురు కోటేశ్వరరావు , పప్పు శ్రీను , గునూరు పెద అచ్చిబాబు , ఎలక మల్లిబాబు , గొర్లి సుధాకర్ , ఎర్లీ శ్రీను , గండి నాయుడు తదితరులు పాల్గొన్నారు.