రెడ్‌బుక్‌ చూసి వణికిపోతున్నారు..మంత్రి నారా లోకేష్

నకిలీ మద్యంతో వేలకోట్లు లూటీ చేశారని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. గతంలో ప్రశ్నిస్తే కేసులు.. పోరాడితే అరెస్టులు ఉండేవని లోకేష్‌ మండిపడ్డారు.  టీడీపీ కార్యకర్తల పోరాటంతో వైసీపీ  అడ్రస్ లేకుండా పోయిందని మంత్రి నారా లోకేష్  ఉద్ఘాటించారు. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతోందని తెలిపారు. 94 శాతం స్ట్రైక్‌‌రేట్‌తో 164 సీట్లు గెలవడం ఆల్‌టైమ్‌ రికార్డ్‌ అని అభివర్ణించారు. కడపలో జరుగుతున్న మహానాడు వేదిక నుంచి లోకేష్ ప్రసంగించారు. టీడీపీ కార్యకర్తల పోరాటంతోనే ఈ విజయం దక్కిందని కొనియాడారు. జెండా పీకేస్తామన్నవాళ్లు అడ్రస్‌ లేకుండా...