SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 12 May 2025, 10:59 am Posted by : SHIVASURYA NEWS

మేయర్ పీలా ను కలిసిన జనసేన కార్పొరేటర్లు

విశాఖపట్నం జయ జయహే: జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి సమక్షంలో జనసేన కార్పొరేటర్లు నూతనంగా ఎన్నికైన జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసి ఘనంగా సత్కరించారు ,రానున్న రోజుల్లో మహా విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణ సుందరికరణ దిశగా అభివృద్ధి కార్యక్రమాల్లో శరవేగంగా చేయాలని నూతన మేయర్ ను కోరారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోవింద్ రెడ్డీ , మూర్తి యాదవ్ , కందుల నాగరాజు , సాదిక్ , లీలావతి ,పెద్దిశెట్టి ఉషశ్రీ , సూర్యకుమారి , మేరీ జోన్స్, వంశీ రెడ్డి పాల్గొన్నారు.