SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 10:24 am Posted by : SHIVASURYA NEWS

మూడు పంచాయతీలకు గ్రామ కమిటీలు ఏర్పాటు

మాడుగుల జయజయహే : తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సంస్థ గత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మాడుగుల మండలంలో మూడు గ్రామాలకు గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించినట్టు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండూరు తెలిపారు. దానిలో భాగంగా సాగరం గ్రామపంచాయతీకి కరక నాగరాజును పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా నియమించినట్లు తెలిపారు. అలాగే తాటిపర్తి పంచాయతీకి సలుగు లక్ష్మి అధ్యక్షులుగా,ఒండ్రు కృష్ణ ఉపాధ్యక్షులుగా, అల్లంకి శంకర్రావు ప్రధాన కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిలుగా గొందెల భీమరాజు, గూడెపు సన్యాసి దొర, అల్లంకి సత్యనారాయణ ఎన్నికైనట్టు తెలిపారు. ఇక వీరవెల్లి గ్రామ కమిటీ అధ్యక్షునిగా పాచిలి నాగేష్, ఉపాధ్యక్షునిగా తలారి రమణ దొర, ప్రధాన కార్యదర్శిగా ముల్లేటి భీమేష్ ఎన్నికైనట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అద్దేపల్లి జగ్గారావు, క్లస్టర్ ఇంచార్జి పుప్పాల రమేష్, వడ్డే రాజకుమార్, ఎన్ సన్యాసిరావు, జి రమణ స్థానిక నాయకులు పాల్గొన్నారు