SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 10:10 am Posted by : SHIVASURYA NEWS

మనుగొడుకో భూమి ఆధారం ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ

అగనంపూడి: జయజయహే : జీవీఎంసీ 85వ వార్డు పినమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అగనంపూడి ప్రజాపిత ఓం శాంతి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం బలిరెడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేచర్ లేనిదే ఫ్యూచర్ లేదు సర్వకోటి జీవన రాశుల మునుగుడకు భూమి ఆధారం. భూమి కేవలం మనుషులకే కాదు జంతువులకు, పక్షులకు, జలరాశులకు ,చెట్లకు భూమి ఆధారం ఈ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉన్నది. చిన్నపిల్లలకు చిన్ననాటి నుండే పర్యవరణం పై అవగాహన నేర్పాలని అన్నారు. పినమడక జెడ్పీ హైస్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె కొండబాబు మట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని కావున విద్యార్థులును చేర్చాలని అన్నారు. అగనంపూడి దివ్య జ్యోతిభవన్ భవన్ ఇంచార్జ్ బీకే రామకోటి సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల కమిటీ కోఆప్షన్ సభ్యులు కడిమి హనుమంతరావు ,అండబోయిన మంగరాజు పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్ సంతోష్ కుమార్, ఆర్ నాయుడు, సిహెచ్ రమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు