SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 19 May 2025, 1:49 pm Posted by : SHIVASURYA NEWS

భారతదేశం .. ధర్మసత్రం కాదు – సుప్రీంకోర్టు

శరణార్థులకు ఆశ్రయాన్ని కల్పించే విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. భారత్.. ధర్మసత్రం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికే 140 కోట్ల మంది జనాభాతో దేశం స్ట్రగుల్ అవుతోందని పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో రెఫ్యూజీల విషయంలో జోక్యం చేసుకోవడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

శ్రీలంకకు చెందిన తమిళ శరణార్థిని ఇంకా కొంతకాలం పాటు నిర్బంధంలో ఉంచుకోవడానికి అనుమతి కోరుతూ దాఖలైన పిటీషన్ పై న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ వినోద్ చంద్రన్ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదోపవాదాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.