ప్రధాని సమక్షంలో అయోధ్యలో దేవాలయాల ప్రతిష్ట

జయజయహే : అయోధ్యలోని రామాలయ సముదాయం మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి సిద్ధమవుతోంది. జూన్ 5న గంగా దసరా సందర్భంగా 14 దేవాలయాల ప్రతిష్ట జరగనుంది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మూడు రోజుల ఉత్సవాన్ని నిర్వహించుచున్నది. మే 30 నుండి శివలింగ ప్రతిష్టాపనతో సహా ఆచారాలు జరుగుతాయి. కాశీ మరియు అయోధ్య నుండి మొత్తం 101 మంది వేద పండితులు 'యజ్ఞశాల' పూజ, వాల్మీకి రామాయణ పారాయణం, మంత్రాల పఠనం, నాలుగు వేదాల నుండి పఠనాలు మరియు ఇతర సాంప్రదాయ వేడుకలతో...