SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 May 2025, 8:28 am Posted by : SHIVASURYA NEWS

ప్రతి మనిషి భౌతిక వాదే! – విద్యావేత్త డా. అలుగు

జయజయహే: ప్రతీ మనిషి భౌతిక వాదేనని..ఆచరణాత్మకంగా అది రుజువని అకలైతే ఆహారాన్నే స్వీకరిస్తాడని అనారోగ్యం వస్తే ఆసుపత్రికే వేళ తాడని ప్రముఖ విద్యావేత్త డా. అలుగు ఆనంద శేఖర్ వ్యాఖ్యానించారు. టి నరసాపురం మండలం రుద్రకోటరాజుగూడెం గ్రామంలో జరిగిన “ప్రత్యామ్నాయ సంస్కృతి” సభలో ఆనందశేఖర్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణా రాష్ట్రానికి చెందిన సంఘ సంస్కర్త,సామాజిక విప్లవ ఉద్యమకారుడు డా. బైరి నరేష్, వారి సతీమణి గాండ్ల సుజాత తో మూడ నమ్మకాలు పైనా, సాంఘిక సంస్కరణోధ్యమం పైనా,సమాజంలో బౌతిక వాద దృక్పథంపైన డా. బైరి నరేష్ తో డా.అలుగు వేదికను పాల్పంచుకున్నారు. ఈ సభకు బి టి ఎస్ రాష్ట్ర కార్యదర్శి బి రామారావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో మర్రి వెంకటేశ్వరరావు, మల్లవరపు సత్యనారాయణ, అర్జా ధర్మారావు, అర్జా సాగర్, అర్జా బోస్, బ్యాటరీ నాగు,కాకర్ల సత్యం,కాంతారావు, తదితరులు పాల్గొని ప్రసంగించారు.