SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 7:26 am Posted by : SHIVASURYA NEWS

ప్రతి పంచాయతీలో వందమంది సూర్య గర్ లబ్ధిదారులు నీ ఎంపిక చేయాలి

మాడుగుల: జయజయహే : భవిష్యత్తు అవసరాలు, ప్రజల సామాజిక ఆర్థికస్థితిగతులు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం చేపట్టిన సూర్యగర్ పథకంలో ప్రతి ఒక్కరు చేరే విధంగా కృషి చేయాలని ఎండిఓ కే అప్పారావు సిబ్బందికి శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో వెలుగు సిబ్బంది సీసీలు, సూర్య గర్ ప్రతినిధులతో తో సమావేశం నిర్వహించి తగు సూచనలు చేశారు. కనీసం ప్రతి పంచాయతీలో వందమంది లబ్ధిదారులు ఉండే విధంగా తగు అవగాహన కల్పించాలని సూచించారు. ముఖ్యంగా వెలుగు సిబ్బంది వివోఏలు డ్వాక్రా గ్రూపులను, స్థానిక నాయకులను అప్రమత్తం చేయాలని, సచివాలయ సిబ్బంది సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు తమకు నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ పథకం విశిష్టత అవసరాలు ప్రభుత్వం అందిస్తున్న సహకారం గురించి కూడా ప్రజలకు వివరించాలన్నారు.