జయజయహే : పెందుర్తి నియోజకవర్గ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెందుర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఏ. పి. ఆయిల్ ఫెడ్ చైర్మన్, విశాఖ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ ప్రజలు నాయకులు నలుమూలలు నుంచి వచ్చి పిర్యాదులు అందజేశారు సుమారు 120 పిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు పై ఎక్కువగా పిర్యాదులు రావటం విశేషం. సంబంధించిన అధికారులుతో మాట్లాడి సమస్యలు త్వరతగిన పరిష్కారం చేయాలని అధికారులకు చెప్పటం జరిగింది ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


