పీఎం సభకు భారీగా తరలివెళ్లిన జనం.
నందవరం, శివసూర్య, అక్టోబర్ 16.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న కర్నూల్ లో నిర్వహించు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ సభకు నందవరం మండలపరిధిలోనిసోమలగూడూరు గ్రామం నుండి జి వెంకట్రామిరెడ్డి టిడిపి అనుచర గణం మరియు,నందవరం లో మార్కెట్ మాజీ చెర్మన్ దేశాయ్ మాధవరావు ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, పొదుపు మహిళలు భారీగా తరలి వెళ్లారు. మండలము నుండి 40 బస్సులలో కూటమి నాయకులు, కార్యకర్తలు, పొదుపు మహిళలు సుమారు 2000 మంది బయలుదేరినట్లు కూటమి నాయకులు, అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి చిన్న రాముడు, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, గోపాల్ రెడ్డి, తెలుగు వీరేష్, నందవరం నుండి బోయ విరేష్, బోయ భీమ్ శేఖర్, మండల టిడిపి కార్యదర్శి లక్షప్ప, గోపి, గడ్డం వెంకటేష్, చాకలి వెంకటేష్,తెలుగు ఈరన్న, సి మల్లికార్జున, చాకలి పంపయ్య, శ్రీనివాసులు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

