Date of Publish : 24 April 2025, 8:26 amPosted by : SHIVASURYA NEWS
పహల్గాం ఎఫెక్ట్: భారతదేశం -పాకిస్తాన్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు
సింధు నదీ జలాల ఒప్పందం కేవలం నదీ జలాల పంపిణీకి సంబంధించిన సాంకేతిక అంశం కాదు. రెండు విరోధ దేశాల మధ్య కూడా శాంతియుత సహజీవనం, సహకారానికి అవకాశం ఉందని నిరూపించిన చారిత్రక డాక్యుమెంట్ అది. సమస్యలు, సవాళ్లు వస్తున్నా, వాటిని ఒప్పందంలో పేర్కొన్న మార్గాల ద్వారా పరిష్కరించుకుంటూ ఈ బంధం ఇలాగే ఇంతకాలం కొనసాగించారు. ఇక పహల్గాం ఉగ్రదాడితో ఈ ఒప్పందానికి స్వస్తి పలకాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య నీటి యుద్ధం జరిగే అవకాశం ఉంది.. ముఖ్యంగా పాకిస్తాన్కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి.