SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 6:50 am Posted by : SHIVASURYA NEWS

పలాస కాశీబుగ్గ లో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలి

శ్రీకాకుళం :జయజయహే : శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న పలాస కాశీబుగ్గ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు దృష్టిలో పెట్టుకొని ఇండోర్ స్టేడియాన్ని పలాస పట్నంలో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి బద్రి సీతమ్మ యాదవ్ కోరారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర పౌర విమానయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష ఇండోర్ స్టేడియం మంజూరుకు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ ప్రాంతంనికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులు నైపుణ్యం చూపిస్తున్నారని వారికి అవసరమైన ఇండోర్ స్టేడియం లేకపోవడం వలన వారి నైపుణ్యం గుర్తించలేని పరిస్థితి ఉందన్నారు. మత్స్యకార గ్రామాలు అత్యధికంగా క్రీడాకారులు తన నైపుణ్య ప్రతిభను చూపిస్తుండడం వలన పలాస కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు తయారు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్లమెంట్ పరిధిలో ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టి సారించాలని కోరారు.