SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 10:42 am Posted by : SHIVASURYA NEWS

నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాం

తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య

విశాఖపట్నం జయజయహే : గుండారం ఆంజనేయస్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి కేకు కట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రజల మనిషి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డైనమిక్ లీడర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా హైదరాబాదును అభివృద్ధి పరిచి హైటెక్ సిటీ కట్టిన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో తీసుకురావాలని సంకల్పంతో ఈరోజు రాజధాని పోలవరం ఒక ధృఢ సంకల్పంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని భావితరాల భవిష్యత్తు బాగుపడాలని బడుగు బలహీన వర్గాలకు వేదోడుగా ఉంటూ గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకు నిధులు లేకుండా చేసి ఘనత జగన్మోహన్ రెడ్డిది . ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసే కార్యక్రమం ఇవ్వడం జరుగుతున్నది అన్ని వర్గాల వారికి అండగా నిలిచిన నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాము జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి లక్ష్మయ్య అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి బొంతల సాయి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరపతయ్య 51 డివిజన్ కార్యదర్శి మాధవరావు 53వ డివిజన్ కార్యదర్శి పొదిలి వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు