SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 8:21 am Posted by : SHIVASURYA NEWS

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ 50వ వర్ధంతి

జయజయహే : అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ళ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ క్రీడా మైదానంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి పూలమాలవేసి నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ గొప్ప అధ్యాపకుడిగా,తత్వవేత్తగా, భారత రెండవ ఉప రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భంగా ఆయనకీ మా ఘన నివాళులు అర్పించారు . ఈ కార్యక్రమంలో నటభూషణ్ శోభన్ బాబు సేవా సమితి చైర్మన్ ముగడ అప్పారావు, శ్రీకాంత్, నరేష్, సురేష్, అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు, డి.వి.ఎన్. కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.