SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 11:06 am Posted by : SHIVASURYA NEWS

జనసేన పార్టీ సభ్యత్వదారులకు ఐడి కార్డులు పంపిణి

విశాఖపట్నం : జయ జయహే: జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనతో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా సభ్యత్వ నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్ అందించేందుకు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆదేశాలతో 29వ వార్డు జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ సమక్షంలో 29వ వార్డ్ కన్నయ్యపేటలో జనసేన పార్టీ సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఐడి కార్డుల ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ క్రియాశీలక సభ్యత్వం పొందే ప్రతి ఒక్కరికి కూడా ప్రమాద జీవిత బీమా కూడా అందించే గొప్ప ప్రయత్నం చేస్తున్నారని దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది లబ్ధి చేకూరినట్లు అంతేకాకుండా జనసేన పార్టీ విధి విధానాలపై మరియు ప్రమాద బీమాపై అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందని మరియు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు జనసేన నాయకులు కార్యకర్తలు క్రియాశీలక సభ్యులు పాల్గొన్నారు.