చోడవరం, జయజయహే : చోడవరం కోర్టు సముదాయాన్ని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా 9వ అదనపు జిల్లా జడ్జి కె.రత్నకుమార్, విశాఖపట్నం, 4వ అదనపు జిల్లా జడ్జి ఎం.నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సమావేశంలో జిల్లా పరిధిలో ఇటీవల వెలుగు చూసిన గంజాయి అక్రమ రవాణా కేసులు, హత్యల వంటి ప్రధాన నేరాల వివరాలను ఎస్పీ న్యాయమూర్తిలకు వివరిస్తూ, వాటి నియంత్రణకు పోలీసులు చేపట్టిన చర్యలను వివరించారు.ఈ సమావేశం న్యాయ వ్యవస్థ, పోలీసు శాఖ మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో కీలకమైనదిగా నిలిచిందని చెప్పాలి.