జగన్ అండ్ కో దోచుకున్న ప్రజల సొమ్మును కక్కిస్తామని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు. చాలామందిని భయపెట్టి డిస్టిలరీలను జగన్ సొంతం చేసుకున్నారని.. ఆయన బెదిరింపులకు పాల్పడి నాసిరకం మద్యం అమ్మారని ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు.
మద్యం కుంభకోణంలో మాత్రమే కాదు.. ఇంకా చాలా విషయాల్లో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు. మద్యం విషయంలో సిట్ చాలా విషయాల్లో విచారణ వదిలేసిందని.. తాను సిట్కు చాలా విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. మద్యం దుకాణాల్లో పనిచేసే వారికి ఎక్కువ జీతాలు చూపించి అందులో వాటాలను జగన్ అండ్ కో కొట్టేశారని ఆరోపించారు. ఒక విజిల్ బ్లోయర్గా సిట్కు మద్యం కుంభకోణానికి సంబంధించిన చాలా విషయాలు చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
చాలామందిని భయపెట్టి డిస్టిలరీలను జగన్ సొంతం చేసుకున్నారని..ఆయన బెదిరింపులకు పాల్పడి నాసిరకం మద్యం అమ్మారని ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన సాంకేతిక ఆధారాలు ఉన్నాయని… ఎవరూ తప్పించుకోలేరని చెప్పుకొచ్చారు. జగన్ అండ్ కో దోచుకున్న ప్రజల సొమ్ములను కక్కిస్తామని హెచ్చరించారు. రూ. 3 లక్షల 32వేల కోట్లు అప్పు చేశానని జగన్ చెబుతున్నారని అన్నారు. మద్యం కుంభకోణాల్లో విదేశాలకు పారిపోయిన నిందితులను రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి మరీ అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. మద్యం కుంభకోణంలో జగన్ పాత్రకు సంబంధించిన ఆధారాలు దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయని, విచారణ ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధంగా ఉండాలని ఎంపీ సీఎం రమేశ్ సవాల్ విసిరారు.

