SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 06 May 2025, 9:40 am Posted by : SHIVASURYA NEWS

కొండూరుకు అంతర్జాతీయ అవార్డు ప్రదానం

జయజయహే : తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధి విందూరు ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు, రచయిత కొండూరు వెంకటేశ్వరరాజుకు విక్టోరియా యూనివర్సిటీ షీల్డ్ అవార్డు 2025 లభించింది. రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ దేశానికి చెందిన అంతర్జాతీయ విద్యా సంస్థ విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ కల్చర్ అండ్ వరల్డ్ పీస్ వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన దృవపత్రాన్ని విక్టోరియా యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మోస్తఫా డిసౌకి అంతర్జాలం ద్వారా మంగళవారం వెంకటేశ్వరరాజుకు బహుకరించారు. ఈ సందర్భంగా సహచర కవులు ఉపాధ్యాయులు కొండూరును అభినందించారు.