SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 11:11 am Posted by : SHIVASURYA NEWS

కరెంట్ షాక్ తో సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి

జయజయహే : విశాఖ నగరం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో,మురళీనగర్ అయ్యప్ప నగర్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని కరెంట్ షాక్ తో శుక్రవారం మృతి చెందారు. పద్మవతి (29) పాల ప్యాకెట్లు, రెండో అంతస్తు నుంచి కేబుల్ వైర్ ద్వారా పైఅంతస్తుకు తీస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందినట్లు ఆమె భర్త అజయ్ 5వ పట్టణ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 5వ పట్టణ పోలీసులు,సీఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కు కేజీహెచ్ కు తరలించారు.