బస్సు ఢీకొనడంతో మహిళ మృతి , మరొకరికి తీవ్ర గాయాలు..
కంచరపాలెం : జయజయహే : కంచరపాలెం ఊర్వశి జంక్షన్ దగ్గర గురువారం ఉదయం ఐదు గంటల యాక్టీవ్ మీద వెళ్తున్న ఫ్యామిలీని బస్సు ఢీ కొట్టింది. విజయవాడ నుంచి పార్వతిపురం వైపు వెళుతున్న ఇంద్ర ఆర్టీసీ బస్సు, తాటిచెట్ల పాలెం వైపు నుండి బర్మా క్యాంపు వైపు కట్టింగ్ అవుతున్న టూ వీలర్ Activa బండిని గుద్దడంతో టూ వీలర్ వెనక కూర్చున్న ఎన్ మేరీ (62 )సంవత్సరాలు అక్కడికక్కడే చనిపోగా డ్రైవ్ చేస్తున్న కూతురు సుధారాణి ,40 సంవత్సరాలు ఆమెకు తీవ్ర గాయాలు తగలడంతో. చికిత్స నిమిత్తం ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ కి తరలించారు..

