ఉత్కంఠగా సివిల్ మాక్ డ్రిల్
ఇకపై సచివాలయాల పరిధిలో కూడా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ వెల్లడి జయజయహే : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం విశాఖపట్టణం నగరంలో బుధవారం పలు చోట్ల సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించింది. అనుకోని రీతిలో ఉగ్రదాడులు జరిగినా, బాంబులు పేలినా, అగ్ని ప్రమాదాలు వాటిల్లినా ఎలా వ్యవహరించాలి అనే అంశాలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ రక్షణ దళాలు ప్రదర్శనలు ఇచ్చాయి. బుధవారం సాయంత్రం ఒన్ టౌన్ పరిధిలోని రాణీబొమ్మ సెంటర్, క్వీన్ మేరీ బాలికోన్నత పాఠశాలలో వేర్వేరుగా నిర్వహించిన...